AP Crime: ఏపీని వణికించిన దొంగల ముఠా అరెస్టు.. భారీగా తుపాకులు, కత్తులు, కారంపొడి స్వాధీనం!
చిత్తూరులో సంచలనం రేపిన దొంగలు ముఠా కేసును పోలీసులు ఛేదించారు. ఏడు మందిని అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. నిందితుల వద్ద ఒక కారు, 3 తుపాకులు, 4 బుల్లెట్లు, 2 కత్తులు, కారంపొడి, 4 పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.