AP: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. కేకలు వినపడటంతో..!
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వాగు దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం.