Tollywood Drugs Case: మత్తెక్కుతోన్న టాలీవుడ్...ఎవరెవరు, ఎలా చేస్తున్నారు?
టాలీవుడ్ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకున్న తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురి వ్యవహారం బయటపడింది. దీంట్లో ప్రముఖ నటుడు, హీరో నవదీప్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం నవదీప్, నిర్మాత ఉప్పలపాటి రవి, హైదరాబాద్ లోని స్నార్ట్ పబ్ యజమాని సూర్యతో పాటూ మరికొందరు పరారీలో ఉన్నారు.