మిచౌంగ్ తుఫాన్ బీభత్సం..ఐదుగురి మృతి..స్కూళ్లు మూసివేత!
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది.
ఏపీలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాన్ మరికొన్ని గంటల్లో బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
భారీ సైక్లోన్ మిచౌంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరువాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయి.
మిచౌంగ్ తుపాను వల్ల చెన్నైలో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. రోడ్లపైకి భారీగా వరద రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలాగే చెన్నై ఎయిర్పోర్టు రన్వే పైకి భారీగా వరద చేరింది. దీంతో అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది.దీని వల్ల ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
మైచౌంగ్ తుఫాన్ భయంకరంగా మారింది. అమెరికాలో వచ్చే తుఫాన్లతో పోల్చినట్లయితే ఇది చిన్నదే. అయినప్పటికీ దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.