అన్ని చర్యలూ తీసుకుంటాం..ఆందోళనలు వద్దు–సీఎం చంద్రబాబు
వరద ప్రాంతాల్లో బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఆందోళన చెంద వద్దని ఆయన అన్నారు. దీంతో పాటూ మరోసారి బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు.