Ganesh Chaturthi: గణేష్ మండప నిర్వాహకులకు సీఎం గుడ్ న్యూస్.. ఆ సదుపాయం ఫ్రీ!
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని, కానీ ఇందుకు పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం తప్పనిసరి ఉండాలన్నారు. చిత్తశుద్ధితో ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు.