దాదాపు 2 నెలల తరువాత...కెనడా ఈ - వీసా సేవలు పునరుద్దరణ!
ఖలిస్తాని ఉగ్రవాది నిజ్జర్ హత్య తరువాత కెనడీయన్ వీసాలను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2 నెలల తరువాత వీసాలను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖలిస్తాని ఉగ్రవాది నిజ్జర్ హత్య తరువాత కెనడీయన్ వీసాలను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2 నెలల తరువాత వీసాలను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును కావాలనే ఓ కెనడా అధికారి దెబ్బతీశాడని.. అక్కడి భారత రాయబారి సంజయ్ వర్మ ఆరోపించారు. కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ డిమాండ్ చేశారు.
భారత్లో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ చేసింది. సమస్య సద్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలో కెనడా ఇలాంటి ప్రకటన చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని భారత్ మండిపడుతోంది.
కెనడా, భారత్ మధ్య పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని వెంటనే పిలుచుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. మీ దౌత్యసిబ్బంది భారత్ లో ఒక్క క్షణం కూడా ఉండేందుకు వీల్లేదని వార్నింగ్ ఇచ్చింది. అక్టోబర్ 10 నాటికి గడువును విధించింది భారత్. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాన్న నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన సంగతి తెలిసిందే.
అవ్వా కావాలి...బువ్వ కావాలి అన్నట్టున్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు. భారత్ తో సన్నహిత సంబంధాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే నిజ్జర్ హత్యోదంతాన్ని మాత్రం వదిలేదని హింట్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా మావైపే ఉందంటూ ప్రకటిస్తున్నారు.
మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.
భారత్- కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజు పెరుగుతున్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య మంటలను పెంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తో బంధం తమకెంతో ముఖ్యమైనదన్నారు బ్లెయిర్. అయినా కూడా నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.
దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.