Crime: బతికున్న కోడిపుంజును ఎద్దుకు తినిపించిన దుర్మార్గులు.. వీడియో వైరల్
జల్లి కట్టు ఎద్దుకు బతికున్న కోడిపుంజును తినిపించిన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. జల్లికట్టు పోటీలకోసం ఎద్దును మచ్చిక చేసుకునేందుకు ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.