Pawan Kalyan: దళిత సీఎం ఎక్కడా?.. పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు!
సీఎం కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని తెలిపారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు.
సీఎం కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని తెలిపారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు.
తమ పార్టీ కోసం రూపొందించిన గులాబీల జెండలే రామక్క సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దీంతో ఈ పాటను కాంగ్రెసోళ్లు కాపీ కొట్టారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర అసలు ఉండదని.. అంతా నకిలీనే అంటూ హుస్నాబాద్ ప్రచారంలో నవ్వులు పూయించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. . ఏడపల్లి మండలం సాటపూర్ గేట్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.
తెలంగాణలో మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు 24 గంటలు కనిపించకపోతే ముస్తాబాద్ వచ్చి కరెంటు తీగలు పట్టుకోవాలని కావాలంటే తాను ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేస్తానంటూ ఛలోక్తులు విసిరారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఈసారి ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురందించారు. రానున్న కాలంలో ఎకరానికి రూ. 16000వేలు ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతు బంధు 16వేలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్లే అని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ఎంతమంది తమ ప్రభుత్వంపై ఏడ్చినా.. మళ్లీ గెలిచేది తామేనని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. , 58 ఏళ్ల పాటు ఏడిపించిన కాంగ్రెస్ ను మరోసారి ఓడించాలన్నారు.