Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి!
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి జరిగిందన్నారు.