వర్షిణి నాకొద్దు .. | Lady Aghori Sensational Comments | Sri varshini | Naga Sadhu | RTV
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శిరావనేలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.
హౌరాలోని ధూలాఘర్లో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలముకుంది. అప్పటికి ఫ్యాక్టరీలో 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 15 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
హర్షసాయిపై బెట్టింగ్ యాప్ కేసు నమోదు అయిన నేపథ్యంలో అతడు ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఒక ఆడియో వైరల్ గా మారింది. తాను గూగుల్ యాడ్ సర్టిఫికేట్ తోనే యాడ్స్ ప్రమోట్ చేసినట్లు తెలిపాడు. అదే సమయంలో ఇమ్రాన్, అన్వేష్ పేర్లను కూడా బయటకు లాగాడు.
చెన్నైలో దారుణం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేసిన జాకీర్హుస్సేన్(57)ను దుండగులు వేటకొడవళ్లతో నరికి నరికి చంపారు. భూవివాదమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య చేసిన వారిలో ఇద్దరు లొంగిపోయారు.
బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీలు తమ హోదాను కాపాడుకోవాలే తప్ప.. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదని తెలిపింది. ఫిల్మ్ఛాంబర్, ‘మా’ నుంచి లేఖ రాయాలని నిర్ణయించాం అని పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కారు ఓవర్టెక్ చేసే క్రమంలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై ఈ ఘటన జరిగింది. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సభాప్రాంగణం లోపలికి జనసైనికులు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరగగా.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ సృహతప్పి పడిపోయింది. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.