Medapati Prakash Reddy : బీజేపీ జెండాను బరాబర్ ఎగరేస్తాం..మమ్మల్ని ఆపేదేవరు...మేడపాటి ప్రకాశ్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ..!!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బోధన్ లో బీజేపీ జెండాను ఎగరవేస్తావని ఆ పార్టీ నేత మేడపాటి ప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పసుపు బోర్డును ఎలా తీసుకువచ్చామో... అలాగే బాండ్ పేపర్ రాసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని బరాబర్ తీసుకువస్తామన్నారు.