Ayodhya Ram Mandir: రెండో రోజు కూడా అయోధ్యలో కొనసాగుతున్న భారీ రద్దీ..!
బుధవారం అయోధ్య రామ మందిరంలోని బాల రామున్ని దర్శించుకునేందుకు భారీ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు స్వామి వారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాల రామున్ని చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయడం లేదు.