Secunderabad Bonalu 2025: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు..సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు.