xAI: ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ.. టెస్టింగ్ షురూ..
ఎలన్ మస్క్ xAIతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సెలెక్టెడ్ కస్టమర్స్ కోసం xAIసర్వీస్ ప్రారంభించారు.
ఎలన్ మస్క్ xAIతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సెలెక్టెడ్ కస్టమర్స్ కోసం xAIసర్వీస్ ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక చట్టాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త బిల్లును అమల్లోకి తేనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లవర్స్తో ప్రేమలో మునిగిపోయి ఉన్నవారికి ఇదే హెచ్చరిక. ఎక్కువగా డిజిటల్ లవర్స్తో ఇంటరెక్ట్ అవ్వకండి. ఎందుకంటే మెషీన్తో ఉండే ప్రేమకి మనుషులతో చేసే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మెషీన్ లవర్ మనం చెప్పినట్టు వింటుంది. రియల్ లైఫ్లో అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓలిన్ బిజినెస్ స్కూల్లో డేటా సైన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లిబర్టీ విట్టర్ట్ అంటున్నారు.
గూగుల్ నుంచి మరో అదిరే ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలను ఎక్కువగా ఉపయోగించుకోని వినియోగదారులకు మరింత దగ్గరవుతుంది గూగుల్. 'గూగుల్ డ్యూయెట్' అనే ఫీచర్తో మీ బిజీ టైమ్లో మీ బదులుగా మీటింగ్లకు AI అటెండ్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం. మీటింగ్కి అటెండ్ అయ్యే టైమ్ ఉండి కూడా 'ఏఐ అసిస్టెంట్ని'ని పంపితే అది తర్వాత మీ కెరీర్కి మైనస్ కావచ్చు.
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తుండడంతో వినియోగదారులకు 'ఏఐ' స్టిక్కర్ ట్రీట్ ఇవ్వనుంది. 'ఏఐ'తో స్టిక్కర్లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి చాలా తక్కువ మందికి మాత్రమే రిలీజ్ అయిన ఈ స్పెసిఫికేషన్.. త్వరలోనే మరింత మందికి అందుబాటులోకి రానుంది.
'ఓపెన్ఏఐ'(OpenAI) నష్టాలు పేరుకుపోతున్నాయి. ఛాట్జీపీటీ కోసం రోజుకు 5 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని కారణంగా సామ్ ఆల్ట్మన్ కంపెనీ నష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఓవైపు ఛాట్జీపీటీ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతుండడంతో పాటు ఖర్చు పెరిగిపోతుండడంతో 2024చివరి నాటికి 'ఓపెన్ఏఐ' దివాలా తీసే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ భారాన్ని భరిస్తున్నట్టు సమాచారం.
ఛాట్జీపీటీ తప్పుల తడక బయటపడింది. టెక్కీలు అడుగుతున్న ప్రశ్నలకు ఛాట్జీపీటీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుందని పరిశోధకులు తేల్చారు. ఓ నివేదిక ప్రకారం మొత్తం 512ప్రశ్నలకు ఛాట్జీపీటీ 259వాటికి తప్పుడు సమాధానాలు చెప్పింది. అంటే 52శాతం రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. దీంతో ప్రాజెక్టుల సలహాల కోసం మళ్లి 'స్టాక్ ఓవర్ఫ్లో'నే నమ్ముకుంటున్నారు టెక్కీలు.
అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణగా నిలవనుంది. పార్లమెంట్ భవనం ఎంట్రీ వద్ద అధునాతన ఫేషియల్ 'ఏఐ' మెకానిజమ్ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇక 'స్మార్ట్ కార్డ్' ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్స్ని కూడా ఉపయోగించుకోబోతోంది ప్రభుత్వం. ఈ కార్డు ఉన్న వాళ్లు మాత్రమే బిల్డింగ్లోని నిర్ధిష్ట ప్రాంతాలకు వెళ్లగలరు.