Revanth Reddy: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు.. ముఖ్యమంత్రి అభినందనలు
పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 ఏళ్ల బాలుడు ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ చికిత్సను అందించిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు , పారా మెడికల్ సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.