AP Capital Issue: రాజధాని విశాఖకు తరలింపు తుగ్లక్ చర్య.. రాయలసీమకు తీవ్ర నష్టం: తులసిరెడ్డి
రాజధానిని విశాఖకు తరలిస్తామన్న ఏపీ సీఎం జగన్ వాఖ్యలపై ఏపీ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజధానికి అమరావతి నుంచి విశాఖను తరలించడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే రాయలసీమకు ఎక్కువ నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.