Alla Nani : జగన్ కు మరో చిక్కు . .వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం!
వైసీపీకి మరో దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం . . ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు .
వైసీపీకి మరో దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం . . ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు .
వైసీపీ ఏర్పడిన తరువాత తొలిసారిగా కేంద్రంలో ఒక బిల్లును వ్యతిరేకించింది. దీనికి కారణం ఇండియా కూటమికి దగ్గర కావడానికే అని ఒక వర్గం పరిశీలకులు అంటున్నారు. కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీకి దూరం అయిన మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే అని కొందరు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏపీ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కర్నూలు జిల్లా మల్కాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో కాపు కాచి మరీ వేటకొడవళ్లు, రాళ్లుతో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.
AP: ఇవాళ సాయంత్రం సీఆర్డీఏ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ పాలనలో తన ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా జనసేన నేతలు వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.
ఆడుదాం ఆంధ్రా అన్న వైసీపీ వాళ్లు అసెంబ్లీకి రాకుండా పోయారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తానంటే తానే వద్దన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల తప్పులకు తాము బాధ్యులం కావొద్దనే వాళ్ల చేరికకు నో చెప్పానన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన బోర్డును గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, ఇప్పుడు 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు.
మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి సర్కార్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమెపై కొత్త ఆరు అభియోగాలు నమోదు అయినట్లు తెలుస్తోంది. శాంతి ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ వేయనున్నట్లు సమాచారం.