AP : ఏపీలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా!
ఈ-ఆఫీస్ అప్గ్రేడ్పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి సూచించారు.
ఈ-ఆఫీస్ అప్గ్రేడ్పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి సూచించారు.
రేపు ఒక్కరోజే ఐదు ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ప్రచార గడువు ముగిసేనాటికి 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తిచేయనున్నారు.
AP: బీజేపీలో తనకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు పరిపూర్ణానంద. చంద్రబాబుది ఓటు బ్యాంకు రాజకీయం అని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం దగా పడుతోందని అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్లు అందజేశారు. ఆరుగురు అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉండి ఎమ్మెల్యే సీటుపై ఉత్కంఠ తొలిగిపోయింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు బీఫాం అందచేశారు. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు నిరాశ ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆస్తులు భారీగా పెరిగాయి. వారి ఉమ్మడి సంపద 2019 నుండి దాదాపు 39% పెరిగింది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు
టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ ను ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలో దాఖలు చేశారు. ముందుగా వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు.
నామినేషన్ల పర్వం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న వేళ.. మాడుగుల అభ్యర్థిని మార్చాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెందుర్తి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న బండారు సత్యనారాయణను అక్కడి నుంచి బరిలోకి దించాలన్నది టీడీపీ ప్లాన్ గా తెలుస్తోంది.
సీఎం జగన్ పై దాడిని ఖండించారు మంత్రి బొత్స. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు గాజువాక సభలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లకు గుడ్ స్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేలు పారితోషికం ఇస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు.