YCP Guntur: గుంటూరులో వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
గుంటూరులో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టీనా, ఆమె భర్త సురేష్ రాజీనామా చేశారు. కొల్లూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేకపోవడం వల్లే వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.