AP: ఏసీబీ వలకు అవినీతి తిమింగలం..!
అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం దొరికింది. వజ్రకరూరు ఎమ్మార్వో కార్యాలయంపై దాడి చేసిన అధికారులు ఎమ్మార్వో మహమ్మద్ రఫీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 5.50 ఎకరాల భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయడానికి రైతు నుండి ఎమ్మార్వో రూ. లక్ష డిమాండ్ చేశారు.