Anand Mahindra: మానవజాతి మారిపోయిందంటూ.. మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా పోస్ట్ చేసిన మరో వీడియో వైరలవుతుంది. ఓ చిన్నారికి వాళ్ల అమ్మ ప్లేట్లో బజ్జి లాంటి ఓ పదార్థం పెడితే ఆ చిన్నారి దాన్ని ఫోన్ అనుకుని చెవి దగ్గర పెట్టుకుంటుంది. మానవ జాతీ బాగా మారిపోయిందంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.