టూరిజం శాఖ ఎండీగా ఆమ్రపాలి
హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆమ్రాపాలి స్థానంలో మరొకరు రానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి ప్రమోషన్ ఇచ్చారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా రోనాల్డ్ రాస్ను నియమించారు.
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి..రాష్ట్ర సర్వీస్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సోమవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. సెంట్రల్ సర్వీస్లో డిప్యుటేషన్ పూర్తవడంతో ఇప్పుడు రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు ఆమ్రపాలి. ఆమెకు కీలక పోస్టు దక్కే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది.