ఔరంగజేబు సమాధిని తొలగిస్తే.. ! | Asaduddin Owaisi First Reaction On Aurangzeb Graveyard | RTV
తెలంగాణలో అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపలేకపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ మండిపడ్డారు. కోపంతో పేపర్లను విసిరేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
కావాలంటే తనను కాల్చి చంపాలని, లేకుంటే నరికి చంపండని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తమను ఏం చేసినా పర్వాలేదు కానీ.. పేదల కోసం నిర్మించిన ఫాతిమా కాలేజీని మాత్రం కూల్చొద్దన్నారు. కొందరు కావాలనీ ఈ కాలేజీ భవనాలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
TS: కొంతమంది మా బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని ఆరోపించారు. HYDలో మేము గెలుస్తున్నామని తెలిసి ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు.
పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారన్నారు.