Telangana News: 60 ఏళ్ల తర్వాత ఆ గ్రామస్తుల్లో సంతోషం.. అసలేం జరిగిందో తెలుసా?
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల పరిస్థితి. రెండు గ్రామాలకు చెందిన సుమారు 1000కి పైగా ఎకరాల ఇల్లు, వ్యవసాయ భూములు 1947లో అప్పటి నిజాం ప్రభుత్వం అజామాబాద్ ఇండస్ట్రీస్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి సేకరించింది. వారికి పరిహారం ఇవ్వకపోగా.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణం జరగలేదు. నేడు ఆ భూముల పట్టాలను గ్రామస్తులకు అందించనున్నారు మంత్రి కేటీఆర్.