Nara Lokesh:ఏసీబీ కోర్టులో లోకేష్ పై సీఐడీ మోమో!
లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. యువగళం యాత్ర ముగింపు సమయంలో పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. యువగళం యాత్ర ముగింపు సమయంలో పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
రూ.40 వేల లంచం తీసుకుంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత ఏసీబీకి పట్టుబడ్డారు. కలెక్టరేట్ ఎదుట జీప్లస్-3 భవన నిర్మాణం చేపట్టగా అందులోనే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్గేజ్ చేశారు. దానిని విడిపించేందుకు కమీషన్ తీసుకున్న రజితపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
విజయవాడ ఏసిబి కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు పిటిషన్స్ మీద ఈ రోజు విచారణ జరగనుంది. వీటితో పాటూ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ కోసం లోకేష్ ఢిల్లీ నుంచి రానున్నారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసు మీద ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి అధికారుల కాల్ రికార్డ్ ఇవ్వాలంటు చంద్రబాబు తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్నారు. దీని మీద ఈ రోజు కూడా ఇరు వర్గాల తరుఫు లాయర్లు వాదించనున్నారు. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ తరువాత ఏసీబీ కోర్టు జడ్జిలు తీర్పును ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులో అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా నేడు తీర్పు రానుంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఎసిబి కోర్టులో నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ , కస్టడీ పిటిషన్ లపై రెండు రోజులుగా ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12గంటల నుంచి 1:30 వరకు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించనున్నారు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రిమాండ్ నేటితో ముగుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కాగా ఇప్పటికే ఒకసారి చంద్రబాబుకు రిమాండ్ ఎసిబి కోర్టు పొడిగించింది. గత నెల 24 న వర్చువల్ గా ఎసిబి కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు జైలు అధికారులు. నేటితో రిమాండ్ గడువు ముగుస్తు ఉండటంతో.. మరోసారి ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా చంద్రబాబును హాజరు పరుచనున్నారు. ప్రస్తుతం బెయిలు పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ ను నేడు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.