Trivikram: డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మాటల మాంత్రికుని తనయుడు!
త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్ డైరెక్టర్ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్ కుమారుడు రిషి కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు.