Hyderabad : ఐపీఎల్ 2024(IPL 2024) 30వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారీ స్కోరు నమోదైంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోరును నమోదు చేసి ఆర్సీబీపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు. సన్రైజర్స్ హైదరాబాద్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గతంలో ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్(MI) పై హైదరాబాద్ 277 పరుగులు చేసింది. ఈ లక్ష్యానికి ధీటుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా 200కి పైగా పరుగులు చేసినా ఆ జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నిలిచింది.
పూర్తిగా చదవండి..SRH : హ్యాట్రిక్ కొట్టిన హైదరాబాద్.. బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన ట్రావిస్.!
ఐపీఎల్ 2024 30వ మ్యాచ్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 25 పరుగుల తేడాతో హైదరాబాద్ హ్యట్రిక్ విజయం అందుకుంది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 7 వికెట్ల నష్టంతో 262 పరుగులు చేసింది.
Translate this News: