Telangana : తెలంగాణలో ఈదురుగాలుల (Stormy Winds) బీభత్సం సృష్టించాయి. ఏకంగా ఏడుగురు ఈ ఈదురు గాలులకు బలయ్యారు. నాగర్ కర్నూలు (Nagarkurnool) జిల్లాలో ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమం ఉంది. భారీ ఈదురుగాలులకు కోళ్ల ఫామ్ గోడ కుప్పకూలడంతో (Collapse The Wall Of Chicken Farm) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాడూరు మండలం ఇంద్రకల్లో ఘటన జరిగింది. అదే జిల్లా తెలకపల్లిలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. శామీర్పేట సమీపంలో బైక్పై చెట్టు కూలడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు నాగిరెడ్డి, రామ్రెడ్డిగా గుర్తించారు.
Also Read : ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వృద్ధుడు.. కాపాడిన కానిస్టేబుల్.!