IND vs ENG : ధోనీ రికార్డు ఔట్.. చరిత్ర సృష్టించిన పంత్!

ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్  అరుదైన రికార్డను నెలకొల్పాడు.   SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా) అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.

New Update
ms-dhoni vs pant

ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్  అరుదైన రికార్డను నెలకొల్పాడు.   SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా) అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. SENA దేశాలలో పంత్ 27 మ్యాచ్‌ల్లో 38.80 సగటుతో 1,746 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి.  32 మ్యాచ్‌ల్లో ధోని 1,731 పరుగులను పంత్  అధిగమించాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా నిలిచాడు.

అంతేకాకుండా పంత్ టెస్ట్ క్రికెట్ లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. 76వ ఇన్నింగ్స్ లోనే పంత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ తర్వాత అత్యంత వేగవంతమైన వికెట్ కీపర్ గా రెండో స్థానంలో నిలిచాడు. 63 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు గిల్ క్రిస్ట్.

అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన వికెట్ కీపర్లు


ఆడమ్ గిల్‌క్రిస్ట్ 63 ఇన్నింగ్స్‌లు
రిషబ్ పంత్ 76 ఇన్నింగ్స్‌లు
ఆండీ ఫ్లవర్ 78 ఇన్నింగ్స్‌లు
కుమార్ సంగక్కర 78 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు