/rtv/media/media_files/2025/03/17/Z78rjjpzfiz0E6BIgjJ4.jpg)
స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు అవమానకరమైన ప్రదర్శన చేసింది. కేవలం 5 రోజుల్లోనే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో పాక్ ఓడిపోగా.. బంగ్లాదేశ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మొత్తానికి దివాలా తీసింది. పాకిస్తాన్ బోర్డు దాదాపు రూ.800 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా బిలియన్ల రూపాయలు లాభపడతామని పాకిస్తాన్ కలలు కన్నది, కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితి ఏర్పడింది. టోర్నమెంట్ కోసం దేశంలోని పలు స్టేడియాలను మెరుగుపరచడానికి పాకిస్తాన్ బోర్డు కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది కానీ చివరికి 85 శాతం నష్టాన్ని చవిచూసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ.851 కోట్ల ఖర్చు
మ్యాచ్లను నిర్వహించడానికి దాదాపు రూ.851 కోట్లు ఖర్చు చేసింది పాక్ క్రికెట్ బోర్డు. అయినప్పటికీ కేవలం రూ. 52 కోట్లు మాత్రమే సంపాదించింది, దీని కారణంగా దాదాపు రూ. 799 కోట్ల నష్టం వాటిల్లింది. దాని ప్రభావం ఆటగాళ్లపైనే పడింది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, పీసీబీ దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు పాకిస్తాన్లోని మూడు వేదికలలో జరిగాయి లాహోర్, కరాచీ, రావల్పిండి. ఇక భారత జట్టు తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడింది. ఫైనల్ కూడా దుబాయ్లోనే జరిగింది. మూడు దేశీయ స్టేడియాలను పునరుద్ధరించడానికి పాకిస్తాన్ బోర్డు 58 మిలియన్లు (సుమారు రూ. 504 కోట్లు) ఖర్చు చేసింది. ఇది పీసీబీ బడ్జెట్ కంటే 50 శాతం ఎక్కువ. టోర్నమెంట్ సన్నాహాల్లో 40 మిలియన్ డాలర్లు (సుమారు 347 కోట్ల భారతీయ రూపాయలు) ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసిన తర్వాత, పీసీబీ కేవలం రూ. 52 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది.
Also Read : Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?