/rtv/media/media_files/2025/03/16/VbpTgQdsYbU6Ylzr4WcA.jpg)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆ జట్టును ఓడించి రెండోసారి WPL టైటిల్ను గెలుచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో ఫైనల్లో కూడా ఓడిపోయింది. మార్చి 15న (ఆదివారం) బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ను 8 పరుగుల తేడాతో ఓడించింది.
మారిజాన్ కాప్ తుఫాను ఇన్నింగ్స్
ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది, కానీ ఆ జట్టు 9 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. 83 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి అల్మోస్ట్ జట్టు ఓటమిని అంగీకరించే సమయంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మారిజాన్ కాప్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. అయితే18వ ఓవర్లో హేలీ మాథ్యూస్ వేసిన బంతికి కాప్ అవుట్ కావడంతో ఢిల్లీ ఆశలు దెబ్బతిన్నాయి. కాప్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేయగా.. జెమిమా రోడ్రిగ్స్ 30 పరుగులు, నిక్కీ ప్రసాద్ 25 నాటౌట్ పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ తరఫున నాట్ స్కైవర్-బ్రంట్ మూడు వికెట్లు తీసింది.
అంతకుముందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించింది. దీంతో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ రెండోసారి WPL టైటిల్ను గెలుచుకుంది. అంతకుముందు 2023లో జరిగిన WPL మొదటి సీజన్ను కూడా ముంబై జట్టు గెలుచుకుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడోసారి ఫైనల్లో ఓడిపోయింది. WPL రెండవ సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి గెలిచింది.
Also read : Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. T20ల్లోకి ‘కింగ్’ రీఎంట్రీ