RCB గెలుస్తుందని రూ. 6 కోట్ల పందెం వేసిన సింగర్

ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలుస్తుందని ప్రముఖ రాపర్ డ్రేక్ రూ.6.41 కోట్లు పందెం వేశాడు. 'ఈ సాలా కప్ నమ్దే' అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టిన డ్రేక్.. తన మద్దతు కోహ్లీ జట్టుకేనని ప్రకటించాడు.

New Update
ipl-rcb-2025

ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలుస్తుందని ప్రముఖ రాపర్ డ్రేక్ రూ.6.41 కోట్లు పందెం వేశాడు. 'ఈ సాలా కప్ నమ్దే' అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టిన డ్రేక్.. తన మద్దతు కోహ్లీ జట్టుకేనని ప్రకటించాడు. డ్రేక్ తన పందెం స్క్రీన్‌షాట్‌ను క్రిప్టో-బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ స్టేక్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.  ఒకవేళ RCB గెలిస్తే అతను క్రిప్టో-బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.11.11 కోట్లకుపైగా ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటాడు. గతేడాది ట్రోఫీని గెలుచుకోవడానికి డ్రేక్  కోల్‌కతా నైట్ రైడర్స్‌ పై రూ.2.07 కోట్లు పందెం వేశాడు. 

ఎవరూ గెలిచిన చరిత్రే

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాత్రి 7గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది.  2008లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. దీంతో ఇప్పుడు ఎవరూ గెలిచిన చరిత్రే అవుతుంది. IPLలో హెడ్-టు-హెడ్ రికార్డులలో ఇరు జట్లు ఇప్పటివరకు 36 సార్లు తలపడగా 18 విజయాలు సాధించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు