Sankranti Special Trains: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి (Sankranti) నేపథ్యంలో మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మధ్య ఈ స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.07176: సికింద్రాబాద్-నరసాపూర్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 31న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆ రోజు రాత్రి 10.5 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07:10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, రాయనపాడు, రామవరప్పాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.
ఇది కూడా చదవండి: Hero Prabhas: నరసాపురం బరిలో ప్రభాస్ పెద్దమ్మ.. ఏ పార్టీ నుంచో తెలుసా?
Sankranthi Special Trains: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు..
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Translate this News: