Crime : బంగారం కోసం కన్నవారినే చంపిన కర్కోటకుడు!

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లో జంట హత్యల కేసులో మిస్టరీ విడింది.చెడు అలవాట్లకు బానిసైన కొడుకు అప్పులు తీర్చడం కోసం తల్లి బంగారం కోసం లక్ష్మణ్‌ అనే వ్యక్తి తల్లిదండ్రులైన కిష్టయ్య, నర్సమ్మ లను దారుణంగా హత్య చేశాడు.

New Update
Crime : బంగారం కోసం కన్నవారినే చంపిన కర్కోటకుడు!

Son Kills Parents : మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లో జంట హత్యల కేసులో మిస్టరీ విడింది. చెడు అలవాట్లకు (Bad Habits) బానిసైన కొడుకు తల్లి ఒంటి పై బంగారం (Gold) కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన గత నెలలో జరిగింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఈ కేసులో అసలు విషయం బయటకు వచ్చింది. అత్తమామల హత్యకు కోడలు కూడా సహకరించింది.

గత నెల 22న నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద వృద్ద దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని సంగారెడ్డి జిల్లా (Sangareddy District) హత్నూర మండలం సాదుళ్లనగర్‌కి చెందిన కిష్టయ్య, నర్సమ్మగా గుర్తించారు. కిష్టయ్య, నర్సమ్మల కొడుకు లక్ష్మణ్ దుండిగల్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసై లక్ష్మణ్ అప్పులపాలయ్యాడు.

అప్పులు తీర్చడానికి తల్లి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసు పై కన్నేశాడు. గత నెలలో తల్లిదండ్రులను ఆ కుమారుడు ఇంటికి పిలిచాడు. ఇంట్లో తల్లిదండ్రులు నిద్రిస్తుండగా తల్లి గొంతునులిమి చంపేశాడు. కాసేపటికే తండ్రి నిద్రలేచి చూడటంతో తండ్రిని కూడా చంపేశాడు. భార్య సహాయంతో కారులో నర్సాపూర్ అడవుల్లో మృతదేహాలను తీసుకువచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టి భార్యభర్తలిద్దరూ (Wife & Husband) పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also read: రైలులో మంటలంటూ రుమార్స్‌..భయంతో పరుగులు..మరో రైలు ఢీకొట్టి అనేక మంది!

Advertisment
తాజా కథనాలు