Telangana: ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు..ఎలా దొరికాడంటే!

సిద్దిపేట జిల్లా.గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ. వీరిలో సత్తవ్వ పేరు మీద ఐదెకరాల భూమి ఉండగా..దాని కోసం కొడుకు చంద్ర శేఖర్‌ నిత్యం గొడవపడుతుండేవాడు. ఆ భూమి కోసం కన్న తల్లిని హత్య చేశాడు.

Telangana: ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు..ఎలా దొరికాడంటే!
New Update

Telangana : ఆస్తులు, అంతస్తుల కోసం కన్నవారినే కడతేర్చుతున్న రోజులు ఇవి. బంధాలతో (Relations) సంబంధం లేకుండా డబ్బే ప్రధానమని భావిస్తున్న పాడు కాలం ఇది. తాజాగా సిద్దిపేట జిల్లా (Siddipet District) లో ఆస్తి కోసం కన్నతల్లినే అతి కిరాతకంగా చంపాడు ఓ కసాయి కొడుకు. పైగా ఈ హత్య (Killed) ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నానా నాటకాలు ఆడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ ఇద్దరు అక్కాచెల్లెళ్లే. సత్తవ్వకు ఓ కుమారుడు, పోషవ్వకు ఇద్దరు కుమారులున్నారు. మల్లయ్య మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. సత్తవ్వ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

సత్తవ్వ కొడుకు చంద్రశేఖర్ సిద్దిపేటలో ఉంటున్నాడు. సత్తవ్వ పేరుపై ఐదెకరాలు భూమి ఉంది. ఆ భూమిని తన పేరుపై మార్చాలని గత కొన్ని రోజులుగా చంద్రశేఖర్ తల్లితో గొడవ పడుతున్నాడు.ఈ నెల 11న ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ మరోసారి భూమి విషయంలో తల్లితో తీవ్రంగా గొడవపడ్డాడు. సత్తవ్వ మాత్రం తన చెల్లెలు పోషవ్వకి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారని.. అందరికి సమానంగా భూమి పంచుతానని తెలిపింది.

దీంతో ఆగ్రహించిన కొడుకు.. తల్లిపై దాడి చేశాడు. తల, శరీర భాగాలపై సత్తవ్వకి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న తల్లి ప్రాణాలు విడిస్తే తనపై వస్తుందన్న ఉద్దేశంతో... కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి కిందపడిందని తండ్రికి చెప్పి నమ్మించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా సత్తవ్వ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అంత్యక్రియల కోసం గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే సత్తవ్వ తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సత్తవ్వ మృతిపై కొడుకుపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పకున్నాడు. ఆస్తి (Land) కోసమే హత్య చేసినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Also read: ఏపీలో దారుణం…వైన్‌ షాపు దగ్గర గొడవ..ఒకరి హత్య!

#son-killed-his-mother #land #telangana #siddipet
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe