TG Teachers: పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై హరీష్ రావు ఫైర్.. ఉపాధ్యాయ దినోత్సవ కానుక అంటూ

గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్, టీచర్లను తొలగించడాన్ని దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

New Update
TG Teachers: పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై హరీష్ రావు ఫైర్.. ఉపాధ్యాయ దినోత్సవ కానుక అంటూ

Telangana: రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం తొలగించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 6200 మందిని డీఈవోలు (DEOs)ను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు..
ఈ మేరకు హరీష్ రావు మాట్లాడుతూ.. పార్ట్ టైమ్ టీచర్లకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదు. అడిగినందుకు ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. ఇదేనా మీ ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారు. మరోవైపు మీ నిర్లక్ష్య, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని. మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటూ హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు.

Advertisment
తాజా కథనాలు