/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/shimla-jpg.webp)
Shiva Temple Collapsed in Shimla: భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం సిమ్లా కురిసిన భారీ వర్షానికి శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ సిఖు (CM Sukhvinder Singh Sukhu) తెలిపారు. సమ్మర్ హిల్ ప్రాంతంలో ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడటంతో డజన్ల కొద్దీ భక్తులు చిక్కకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టింది.
Big Breaking: The Shiva temple in Sumner hill of Shimla collapsed, 15 people are buried underneath. pic.twitter.com/qKzlNSEtui
— Go Himachal (@GoHimachal_) August 14, 2023
శ్రావన మాసం కావడంతో శివాలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు సంఘటనా స్థలంలో దాదాపు 50మంది భక్తులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు స్థానియ యంత్రాంగం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు. స్థానిక యంత్రాంగం శిధిలాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని శిథిలాల కింది చిక్కిన వారిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు.
Distressing news has emerged from Shimla, where the “Shiv Mandir” at Summer Hill collapsed as a result of the heavy rainfall.
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
As of now, nine bodies have been retrieved. The local administration is diligently working to clear the debris in order to rescue individuals who may…
శివాలయం కూలిన ప్రదేశానికి సీఎం వెళ్తున్నట్లు సమాచారం. కాగా హిమాచల్ ప్రదేశ్లో (Himachal Pradesh) గత 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నది నీటిమట్టం పెరిగింది. భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఆరుగురు మరణించారు. ఇదిలా ఉండగా సోలన్లో ఒక గ్రామంలో మేఘాల పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు . ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జాదోన్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆరుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
Again tragedy has befallen Himachal Pradesh, with continuous rainfall over the past 48 hours.
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
Reports of cloudbursts and landslides have emerged from various parts of the state resulting in loss of precious lives and property.
I urge the people to avoid areas prone to… pic.twitter.com/EQAWn3kqVd
గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, బస్సులు, ట్రక్కులు చిక్కుకుపోయాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం, సోలన్లోని కోటి సమీపంలోని చక్కి మోర్ వద్ద రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు నిలిచిపోయాయి, రోజంతా నిరంతరాయంగా స్లైడింగ్ రహదారిపై కదలికకు ఆటంకం కలిగింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో హమీర్పూర్లోని అన్ని ప్రాంతాలలో పంటలు, దెబ్బతిన్నాయి. ప్రజలు బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ఆగస్టు 14 నుండి 17 వరకు వివిక్త ప్రదేశాలలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: 10వేల మంది పోలీసులు..యాంటీ డ్రోన్ సిస్టమ్..ఇండిపెండెన్స్ డేకి హై సెక్యూరిటీ..!!