/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-23-7.jpg)
Hyderabad: తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే నెలలో అత్యధికంగా ప్రయాణికులు ప్రయాణించిన ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. ఈ మేరకు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మే నెలలోనే 2.3 మిలియన్ల మంది ప్రయాణికులు ఇక్కడినుంచి జర్నీ చేసినట్లు తెలిపింది. 2023తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణీకుల రద్దీ 11 శాతం పెరిగిందని, మే 18, 2024న ఈ ఎయిర్పోర్టు నుంచి 82,300 మంది ప్రయాణికులు వెళ్లినట్లు తెలిపింది. ఇక దేశీయ ట్రాఫిక్ 10, అంతర్జాతీయ ట్రాఫిక్ 14 శాతం పెరిగినట్లు చెప్పింది. మే 4న అత్యధికంగా 548 విమానాల రాకపోకలు జరిగినట్లు వెల్లడించింది.