Shafali Verma Record: చెన్నైలో సౌతాఫ్రికా మహిళల టీమ్ తో భారత్ మహిళల టీమ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ మొదటిరోజే రికార్డుల మోత మోగించారు టీమిండియా అమ్మాయిలు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన షఫాలీ వర్మ 205 పరుగులు, స్మృతి మందన 149 పరుగులు చేసి టీమ్ ఇండియా మహిళా జట్టు తొలి వికెట్కు 292 పరుగులు జోడించారు. సతీష్ శుభ 15 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 55 పరుగులు చేసి ఔటయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్ అజేయంగా 42 పరుగులు, రిచా ఘోష్ అజేయంగా 43 పరుగులు చేశారు. తొలి రోజు భారత్ 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది.
పూర్తిగా చదవండి..Shafali Verma Record: సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన షఫాలీ.. చెన్నై టెస్ట్ లో రికార్డులే రికార్డులు!
సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో 205 పరుగులతో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. షెఫాలీ కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి మహిళా టెస్ట్ క్రికెట్ లో కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో మ్యాచ్ మొదటి రోజు భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది.
Translate this News: