/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T174455.768.jpg)
UGC Admission: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బోర్డ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో యేడాకికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి రెండు దశల్లో జూలై-ఆగష్టు, జనవరి-ఫిబ్రవరి నెలల్లో అడ్మిషన్లు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు దేశీయ యూనివర్శిటీల్లో ఏటా రెండుసార్లు అడ్మిషన్లు కల్పించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలుంటాయని బోర్డ్ తెలిపింది. బోర్డు ఫలితాల్లో వివిధ కారణాలతో జూలై-ఆగష్టులో అడ్మిషన్ తీసుకోలేకపోయిన వారికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని, రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృధా కాకుండా ఉంటుందని చెప్పారు. మరోవైపు కంపెనీలు సైతం క్యాంపస్ రిక్రూట్మెంట్లను రెండుసార్లు నిర్వహించవచ్చని జగదీష్ తెలిపారు.
Why is Biannual Admission important: Listen to Prof. @mamidala90, Chairman UGC.
1) Flexibility, as students can now apply twice a year, avoiding long waits if they miss the July/August session;
2) Increased Access, with more opportunities for students to join their desired… pic.twitter.com/tdtZh20avS
— UGC INDIA (@ugc_india) June 11, 2024
రెండుసార్లు అడ్మిషన్ల ద్వారా విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు తమ ఫ్యాకల్టీ, క్లాస్రూమ్, ల్యాబ్, ఇతర సౌకర్యాలను మరింత సమర్థవంతంగా కలిగి ఉండొచ్చు. విదేశీ యూనివర్శీటీల్లో ఈ విధానం ఇప్పటినే ఉన్నందున అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి వీలవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీలు ఈ విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఇది తప్పనిసరి కాదు. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్న విద్యా సంస్థలు దీన్ని ఉపయోగించవచ్చని జగదీష్ కుమార్ స్పష్టం చేశారు.