Operation Chirutha in Tirumala: తిరుమలలో చిరుత కదలికలకు కారణం అదే: పీసీఎఫ్ నాగేశ్వర రావు
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదరనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (AP GENCO), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) సంయుక్తంగా.. ఈ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగా వాట్లు., అనంతపురం జిల్లాలోని కమలపాడులో 1950 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు పీఎస్పీలను సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణానికి రెండు సంస్థలు పరస్పరం అంగీకరించాయి.
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కరిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న అల్పపీడన ద్రోణి కోస్తా భాగాలపై కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని వలన దక్షిణ కోస్తా ఏపీలోనూ బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ.. వంటింట్లో ఏదొక పని ఉంటూనే ఉంటుంది. ఉదయాన్నే టీ - కాఫీలతో మొదలయ్యే వంటింటి పని.. రాత్రి భోజనాల తర్వాత కూడా పూర్తవ్వదు. మరుసటిరోజు చేసుకోవచ్చని అలసటతో పడుకుంటాం. కొన్ని చిట్కాలను తెలుసుకుంటే.. మనం రోజూ చేసే పనుల్లో కొన్ని ఈజీగా పూర్తి చేసేయొచ్చు.
పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య అని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సోమవారం ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన బండి సంజయ్.. ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తోన్న ఏకైక సర్కార్ జగన్ దే అని ఆరోపించారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ దుయ్యబట్టారు బండి సంజయ్.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజక వర్గంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ.. లోకేష్ తో సమావేశమై పార్టీలో చేరారు. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది.
తాను ఇప్పటికిప్పుడు చనిపోయినా పర్వాలేదని, తన కుటుంబాన్ని అంతా సెటిల్ చేశానని పోసాని చెప్పారు. తాను చనిపోయాక.. తన శవాన్ని కూడా ఇండస్ట్రీ వారికి చూపించకూడదని భార్యకు చెప్పినట్లు తెలిపారు. నా కుటుంబానికి అంతా సెటిల్ చేసి పెట్టానని, తన చావు గురించి నా భార్యని కూడా ముందుగానే ప్రిపేర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. చూడమ్మా.. నేను ఎప్పుడు చచ్చిపోయినా ఏడవద్దు.. నీ పేరు మీద రూ.50 కోట్ల ఆస్తి ఉంది.. నేను చచ్చిపోయాక నీకు, పిల్లలకు ఎటుంటి ఇబ్బంది రాదన్నారు. నువ్వు ఏ పని చేయకపోయినా నెలకు రూ.8 లక్షలు రెంట్ వచ్చేలా ఏర్పాటు చేశానని పోసాని తెలిపారు.
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎలాంటి దాడులు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు ప్రభుత్వ శాఖలు ఇటీవల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులను నిరసిస్తూ మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ చేసింది. మార్గ దర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మార్గదర్శి సంస్తలపై ఎలాంటి దాడులు చేయవద్దని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.