AP CM Jagan Speech: ఏ ఒక్క ఉద్యోగికి తమ ప్రభుత్వం అన్యాయం చేయలేదు: సీఎం జగన్
ట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు ఎన్నికల సమయంలో పెంచిందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్. సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవో మహా సభల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సమస్యలు వస్తాయని వారించినా తాము వెనకడుగు వేయలేదని అన్నారు. తాము నిజాయితీ, కమిట్మెంట్ తో అడుగులు వేశామన్నారు సీఎం. అలాగే పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు.