దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు.. లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!
ప్రజలకు తాగు నీరు పేరుతో కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెట్టామని అబద్దాలు చెబుతోన్న లోకేష్.. దొచుకున్న లెక్కల వివరాలను బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే బొల్లా. అడ్డదారిలో ముఖ్యమంత్రిగా, మంత్రిగా అవతరించిన చంద్రబాబు, లోకేష్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిని రాజధానిని చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ చూపించారని.. కానీ చివరికి చేతులెత్తేశారని విమర్శించారు. వినుకొండ ప్రజలకు తాగునీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఎమ్మెల్యే నిలదీశారు..