ఏపీలో ఒకేసారి రెండు ఊర్లను ముంచిన సర్పంచ్.. తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సర్పంచ్‌ చేసిన పని తోకాడ, మల్లంపూర్ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మట్టి తవ్వకాలకోసం చెరువుకు గండి కొట్టించడంతో ఇళ్లలోకి నీరు చేరడంతోపాటు చేతికొచ్చిన ధాన్యం, పంట పోలాలు నాశనం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.

New Update
ఏపీలో ఒకేసారి రెండు ఊర్లను ముంచిన సర్పంచ్.. తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సర్పంచ్‌ చేసిన పని తోకాడ, మల్లంపూర్ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తోకాడలోని ఊర చెరువుకు సర్పంచ్ గండి కొట్టించడంతో ఈ రెండు ఊళ్లలోని కాలనీలు, పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పంటపొలాలు మునగడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యకు నీళ్లు రావడంతోపాటు చేతికొచ్చిన ధాన్యం, మితగా పంట పోలాలు నాశనం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.

ఈ మేరకు ఇటీవల వచ్చిన తుపాను ఎఫెక్ట్ తో ఈ చెరువు నిండుకుంది. అయితే గ్రామ సర్పంచ్ దగ్గరుండి గండి కొట్టించడంతో జగనన్న ఇండ్లలోకి భారీగా నిరు చేరింది. ధాన్యం నీట మునిగింది. గ్రామస్థులు, జనసేన నాయకులు అక్కడకు చేరకుని ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకులు మట్టి తవ్వకాలకోసం వేలం పాట పాడుకున్నారని, ఇందులో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డరంటూ మండిపడుతున్నారు. చెరువులో మట్టి తవ్వకాలకు నీరు అడ్డుగా ఉందని, దీంతోనే గండి కొట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే దీనిపై తమకు ముందుగా సమాచారం ఇస్తే బాగుండేదని, నష్ట పరిహారం ఎవరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Also read :ఎనిమిదేళ్ల బాలికపై పగ తీర్చుకున్న సైకో.. బెల్ట్‌తో కట్టేసి గొంతు..

అలాగే గంతలోనూ ఈ చెరువుకు లీజ్ కు తీసుకున్న నేపథ్యంలో భారీ నీరు చేరడంతో నష్టపోతున్నామని, నీరు బయటకు పంపిస్తేనే మట్టి తవ్వకాల పనులు జరుగుతయని వైసీపీ నాయకులు చెప్పినట్లు గ్రామస్థులు తెలిపారు. గేట్ల ద్వారా అయితే ఆలస్యం అవుతుందనే కారణంతో గండి కోట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన గ్రామస్థులు, జనసేన తదితర పార్టీ నాయకులు వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దాదాపుగా 10 లక్షలకు పైగా నష్టపోయామని, తొకడ గ్రామంలోని పంచాయితిలో ఏ వ్యక్తి కూడా తమ బాధలు విని స్పందించే వారు లేరని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశువులు, పొలాలు మునిగిపోతాయని చెప్పిన వినలేదని, కోట్ల రూపాయలు ఇచ్చి ఎందుకు ఆగాలని ఎదురు దాడికి దిగినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలున్నాయని.. చట్ట పరంగా న్యాయ పోరాటం చేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు