TS: నా ప్రియురాలు లేకుండా ఉండలేకపోతున్నా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్!

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి చావుకు ఆమె తండ్రి, బీజేపీ లీడర్ రాజిరెడ్డే కారణమని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

New Update
TS: నా ప్రియురాలు లేకుండా ఉండలేకపోతున్నా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్!

Sangareddy: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు శ్రీహరి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మూడు రోజుల కిందటే శ్రీహరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్చించారు. అయితే, ఆస్పత్రి నుంచి గత రాత్రి శ్రీహరి పరార్ అయ్యాడు. తెల్లవారుజామున చూసే సరికి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.

Also Read: దువ్వాడ వాణి 5 డిమాండ్స్ ఇవే.. ఆ కండిషన్ కు ఒప్పుకోని ఎమ్మెల్సీ!

చనిపోయే ముందు ఇన్‌స్టాలో శ్రీహరి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే సూసైడ్ నోట్‌గా భావించాలని.. తనది వన్‌ సైడ్ లవ్‌ కాదని.. ఒకరినొకరు ప్రేమించుకున్నాని పోస్ట్ చేశాడు. తేజస్విని చావుకు ఆమె తండ్రి, రాజురెడ్డి అనే బీజేపీ లీడరే కారణమని పోస్ట్ లో పేర్కొన్నాడు. 'తేజస్వి లేకుండా ఉండలేకపోతున్నా.. తన దగ్గరికే వెళ్తున్నా.. అక్క.. అమ్మని బాగా చూసుకో..చనిపోయాక అయినా మాకు న్యాయం చేయండి.. నిందితులను కఠినంగా శిక్షించండి' అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Also Read: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు!

కాగా, గుమ్మడిదలకు చెందిన బీఫార్మసీ విద్యార్థి తేజస్వికి..ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శ్రీహరి పరిచయమైయ్యాడు. అయితే, శ్రీహరి వేధింపులతో విద్యార్థిని తేజస్వి ఆత్మహత్య చేసుకున్నడని ఆమె కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తేజస్వి తల్లిదండ్రులు శ్రీహరిపై పోలీసులు ఫిర్యాదు చేయగా గుమ్మడిదల పీఎస్‌లో అతడిపై కేసు నమోదైంది. భయంతో మూడు రోజుల కిందట శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా గత రాత్రి ఆసుపత్రి నుంచి పరార్ అయ్యాడు. శ్రీహరి కనిపించడం లేదంటూ సూరారం పోలీస్ స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేయగా.. సాయినాథ్ సొసైటీ నిర్మాణ ప్రాంతంలో శ్రీహరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు