Sajjala Ramakrishna Reddy: ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు.. సజ్జల హాట్ కామెంట్స్ సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారన్నారు. నటన చంద్రబాబుకు అలవాటని.. నటించాల్సిన అవసరం జగన్కు లేదని పేర్కొన్నారు. By V.J Reddy 14 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది పూర్తిగా పిరికిపంద చర్య అని అన్నారు. ప్రజలు నుండి వస్తున్న స్పందన చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి అని పేర్కొన్నారు. కంటి పై భాగంలో దాడి జరిగింది.. ఒకవేళ అది క్రిందకు తగిలితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది? అని ప్రశ్నించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటిపై దాడి చేశారని.. ఎయిర్ గన్ లాంటి ఆయుధాలతో దాడి చేశారని ఆరోపించారు. అంత పెద్ద గాయం అయ్యింది.. కచ్చితంగా బలమైన ఆయుధంతో దాడి చేసారని అభిప్రాయడ్డారు. ఇది తుంటరి ముకల చర్య కాదు.. దేశ ప్రధాని తో చాలా మంది జగన్ మీద దాడిని ఖండించారు.. చంద్రబాబు కూడా ఖండించడంతో దోషులను శిక్షించాలని కోరారు. టీడీపీ నేతలు ఇదంతా నటన అంటూ మాట్లాడాతున్నారని ఫైర్ అయ్యారు. బుద్ది ఉన్నవాడు ఏవడైనా.. ఇలా మాట్లాడుతారా? అని మండిపడ్డారు. వాళ్లు అసలు మనుషులేనా? అని అన్నారు. అధికార వైఫల్యం అంటూ టీడీపీ నేతలు అంటున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జరిగిన దాడిని అధికారులు వైఫల్యం అని ఎందుకు అనలేదు అని నిలదీశారు. రాజకీయాలు పక్కన పెడితే... చంద్రబాబు పెద్ద నటుడు అని సెటైర్లు వేశారు. 2003 లో చంద్రబాబు మీద జరిగిన అటాక్ కూడా నటనేనా? అని ప్రశ్నించారు. జగన్ ప్రజల్లోకి వచ్చిన తరవాత చంద్రబాబు లో భయం పట్టుకుందని అన్నారు. ఆ భయం చంద్రబాబు టోన్ మారిందని ఎద్దేవా చేశారు. #attack-on-cm-jagan #chandrababu #sajjala-ramakrishna-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి