చంద్రబాబును మించిన 420 ఇంకొకరు ఉండరు!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు

New Update
చంద్రబాబును మించిన 420 ఇంకొకరు ఉండరు!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు.. ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌ను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేతను మించిన 420 మరొకరు ఉండరన్నారు. అమరావతి పేరుతో 3 వేల ఎకరాలను జేబులో పెట్టుకున్నారన్నారు. జనాన్ని ముంచే రియాల్టర్‌గా చంద్రబాబు మారాడని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రజాజీవితాలను చీకటిమయం చేశారన్నారు.వైసీపీ అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ఏపీ మరో శ్రీలంక అవుతుందని గగ్గోలు పెట్టి.. ఎన్నికలు రాగానే ఫ్రీ స్కీమ్‌లు ప్రకటిస్తున్నారని సజ్జల చురకలంటించారు.

సంక్షేమ పథకాల పేరుతో ఏపీని జగన్ అప్పులపాలు చేస్తున్నాడని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుస్తాడని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడేమో జగన్ రూ.1 రూపాయి ఇస్తే, తాను రూ.100 ఇస్తానని హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో విజయవాడ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.చంద్రబాబు, ఆయన బ్రోకర్ల కోసం కృష్ణా జిల్లాను తాకట్టు పెట్టారని సజ్జల ఆరోపించారు.

జనానికి జ్ఞాపకశక్తి ఉండదని చంద్రబాబుకు అపారనమ్మకమని ఎద్దేవా చేశారు. తన దత్త కొడుకు, సొంత కొడుకు ఇక్కడకు దగ్గరలోనే ఉన్నారని పవన్ కల్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. 2014-19 వరకు ఏం చేశారో వారిద్దరూ చెప్పడం లేదన్నారు. కానీ ఏం చేస్తామో ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు