Delhi : విశ్వబంధు.. మోడీ గ్యారెంటీపై జయశంకర్ కీలక వ్యాఖ్యలు!

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ మోడీ గ్యారంటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ గ్యారంటీలను విశ్వ బంధు అనే కాన్సెప్ట్ తో దౌత్య పరంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఎక్కడున్నా ఈ గ్యారంటీ వర్తిస్తుందన్నారు.

Delhi : విశ్వబంధు.. మోడీ గ్యారెంటీపై జయశంకర్ కీలక వ్యాఖ్యలు!
New Update

Jaishankar : మోడీ(PM Modi) గ్యారంటీలపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP) ఇచ్చేవీ హమీలు కావని, మోడీ గ్యారంటీలుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మోడీ గ్యారంటీలను విశ్వ బంధు అనే కాన్సెప్ట్ తో దౌత్య పరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. తాము కేవలం దేశం కోసం మాత్రమే కాదు ప్రపంచం కోసం పని చేస్తామన్నారు.

ఇండియా పైన నమ్మకంతో ఉన్నాయి..

అలాగే ప్రపంచ దేశాలన్నీ ఇండియా(India) పైన నమ్మకంతో ఉన్నాయని చెప్పారు. UPA హయాంలో దౌత్య అంశాలపైన ఏం చేద్దాం అని మీటింగ్ పెట్టేవారు. చివరికి ఏం చేయకుండా ఉండేవారు. దాడులు జరిగినప్పుడు పాకిస్థాన్ విషయంలోను UPA ప్రభుత్వం మీటింగ్ పెట్టి, ఏం చేయకుండా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నిర్ణయాలు వెంటనే ఉంటాయి. మాకు ఇండియా ఫస్ట్. దేశం విషయంలో వెనక్కి తగ్గం. మోడీ గ్యారెంటీ దేశం బోర్డర్ దగ్గరే ఆగిపోదు. ప్రపంచమంతా మోడీ గ్యారెంటీ ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Satwiksai: ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే BMW కారు.. చాముండేశ్వరినాథ్ బంపర్ ఆఫర్!

ఎక్కడున్నా మోడీ గ్యారంటీ వర్తిస్తుంది..

ఇక మన వాళ్లు ఎక్కడున్నా.. వాళ్లకు సంబంధించిన అంశాల్లో వారికి మోడీ గ్యారెంటీ(Modi Guarantee) వర్తిస్తుందన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనున్నాం. బీజేపీ పైన అనేక విమర్శలు చేస్తారు. వాటిని మేము పట్టించుకోం. ఒకప్పుడు మన వాళ్లు విదేశాలకు వెళ్తే సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా నెక్ట్స్ టార్గెట్ చాలా పెద్దగా ఉంది. పదేళ్లలో దేశం కోసం, ప్రపంచం కోసం పని చేశాం. మరింత చేయబోతున్నామన్నారు.

#pm-modi #modis-guarantees #s-jayashankar #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe