Telangana: డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు

హైదరాబాద్‌లోని సురారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
New Update

Road Accident : హైదరాబాద్‌ (Hyderabad) లోని సురారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదం కారణంగా.. బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను కట్టడి చేశారు. జీడిమెట్ల డిపో (Jeedimetla Depo) కు చెందిన ఆ ఆర్టీసీ బస్సు.. గండి మైసమ్మ (Gandi Maisamma) నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Also read: తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్?

#rtc #telugu-news #tgsrtc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe